Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలతో ఉన్న బైతుల్లా మసూద్: తాలిబాన్

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2009 (15:31 IST)
పాకిస్థాన్‌లోని తాలిబాన్ తీవ్రవాద సంస్థ అధినేత బైతుల్లా మసూద్ అమెరికా రక్షణ బలగాలు జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోలేదని తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రెండు రోజుల క్రితం అమెరికా సైన్యం నిర్వహించిన వైమానికి దాడుల్లో బైతుల్లా మరణించిన పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ వ్యవహారంపై నోరుమెదపని తాలిబాన్ తీవ్రవాద సంస్థ శనివారం మాత్రం ఆకస్మాత్తుగా ఒక ప్రకటన చేసింది.

పాకిస్థాన్‌లోని తమ సంస్థ కీలకనేత బైతుల్లా మసూద్ అమెరికా వైమానిక దాడుల్లో మృతి చెందలేదని ఆఫ్గనిస్థాన్‌లోని తాలిబాన్ తీవ్రవాద సంస్థ కీలక నేత హకీముల్లా మసూద్ స్పష్టం చేశారు. బైతుల్లా మృతిపై అమెరికా, పాకిస్థాన్ ప్రభుత్వాలు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా, వైమానిక దాడుల్లో బైతుల్లా మృతి చెందలేదని పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ ఛానల్ కూడా శనివారం స్పష్టం చేసింది. ఈ వార్తలను బీబీసీ న్యూస్ కూడా సమర్థించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments