Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాకరన్ తల్లిదండ్రులను వేధించడం లేదు: లంక

Webdunia
శ్రీలంక యుద్ధంలో మృతి చెందిన ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ చీఫ్ ప్రభాకరన్‌కు సంబంధించిన బంధువులను, అతని తల్లిదండ్రులను తామేమీ వేధింపులకు గురి చేయడం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. శ్రీలంకలోని శరణార్థ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రభాకరన్ తల్లిదండ్రులు, బంధువులు, ఇతర ఎల్టీటీఈ నేతలను తాము వేధించడం లేదని ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స వెల్లడించారు.

శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స మాట్లాడుతూ.. ప్రభాకరన్ తల్లిదండ్రులు, మాజీ ఎల్టీటీఈ నేత తమిళ్‌సెల్వన్ భార్య, ఇతర ఎల్టీటీఈ అగ్రనేతల దగ్గరి బంధువులు శరణార్థ శిబిరాల్లో ఉన్నారు. వారిపట్ల తామేమీ అమానుషంగా ప్రవర్తించడం లేదని, తమ సైన్యం వారికి సాయం చేస్తోందని రాజపక్స తెలిపారు.

వన్నీ శరణార్థ శిబిరంలో ఉంటున్న ప్రభాకరన్ తల్లిదండ్రులపట్ల శ్రీలంక ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు వచ్చిన కథనాలను రాజపక్స ఈ సందర్భంగా తోసిపుచ్చారు. వీరితోపాటు అంతర్యుద్ధం కారణంగా క్యాంపుల్లో తలదాచుకుంటున్న మూడు లక్షల మంది పౌరులతో శ్రీలంక ప్రభుత్వం స్నేహపూరితంగా మెలుగుతోందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

Show comments