Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్...ముగ్గురి మృతి

Webdunia
FILE
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో శనివారం ఉదయం భారీ పేలుళ్ళు సంభవించాయి. రాజధానిలోని విదేశీ రాయబార కార్యాలయాలు, నాటో ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్ళు జరిగాయి.

రానున్న ఐదు రోజుల్లో ఇక్కడ అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పేలుళ్ళు జరగడం వెనుక ఉగ్రవాదులు ముందస్తు వ్యూహంగా విదేశీ రాయబార కార్యాలయాలను లక్ష్యంగా ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుళ్ళు జరిగిన ప్రదేశంలో పొగ దట్టంగా కమ్ముకుంది.

పేలుళ్ళు జరిగిన అనంతరం రోడ్డంతా రక్తపు మడుగులా మారింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా 14మంది తీవ్ర గాయాలపాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. గాయాలపాలైనవారిలో చాలామంది పిల్లలున్నారు. వీరు నాటో ప్రధాన కార్యాలయం ముందు జిగురు అమ్ముతున్నారు.

దాడులు జరిగిన ప్రాంతంలో వాహనాలు చాలావరకు పాడైపోయాయని గాయాలపాలైనవారు మరింతమంది ఎక్కువకావచ్చని ఆఫ్గనిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహమ్మద్ జహీర్ అజీమీ తెలిపారు.

శనివారం జరిగిన ఈ దుర్ఘటనతో ఆ దేశ రాజధాని అట్టుడికిపోయింది. కాబూల్‌లోని అంతర్జాతీయ రాయబార కార్యాలయాలకు సమీపంలో ఈ సంఘటన జరిగిందని, నాటో కార్యాలయానికి నలువైపులా సిమెంట్ బ్లాకులు కట్టడం వలన దుండుగులు లోనికి ప్రవేశించలేకపోయారని, నాటో కార్యాలయం పాక్షికంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments