Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్, తీవ్రవాదంపై అమెరికాతో భారత్ చర్చలు

Webdunia
పాకిస్థాన్, తీవ్రవాదం అంశాలపై భారత హోం శాఖ మంత్రి పి.చిదంబరం అమెరికా నేతలతో చర్చలు జరిపారు. దక్షిణాసియా ప్రాంతంలో తీవ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని విస్తరించడంపై భారత్- అమెరికా దేశాల నేతలు తాజా చర్చల్లో దృష్టిసారించారు. చిదంబరం బుధవారం ఒబామా అధికారిక యంత్రాంగంలోని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

ముంబయి ఉగ్రవాద దాడుల సూత్రధారులను చట్టం ముందుకు తీసుకురావడంలో పాక్ ప్రభుత్వ పాత్రపై చిదంబరం, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జనరల్ జేమ్స్ జోన్స్ మధ్య జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటి వైట్‌హోస్‌లో జరిగింది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జోన్స్ ఇరుదేశాల మధ్య తీవ్రవాద నిరోధక చర్యలు, కార్యకలాపాల్లో విస్తృత సహకారాన్ని కోరారు.

ఇదిలా ఉంటే తాజాగా చిదంబరం నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జానెట్ నాపోలిటానో, అమెరికా అటార్నీ జనరల్ ఎరిక్ హెచ్ హోల్డర్ జూనియర్‌లతోనూ సమావేశమయ్యారు. అనంతరం సెనెట్ నిఘా కమిటీ ఛైర్‌వుమన్, సెనెటర్ డయానే ఫెయిన్‌స్టెయిన్‌తోనూ చర్చలు జరిపారు. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌తో గురువారం చిదబంరం భేటీ కానున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments