Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ చర్యలు తీసుకునే వరకు చర్చలు ఉండవు

Webdunia
తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న తీవ్రవాద సంస్థలపై విశ్వసనీయ చర్యలు తీసుకునే వరకు ఉపఖండ చర్చల ప్రక్రియ పునరుద్ధరించబడదని గురువారం భారత్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ వారి భూభాగంలోని తీవ్రవాద గ్రూపులపై విశ్వసనీయ చర్యలు తీసుకోవాలని, ఆ తరువాతే ఇరుదేశాల మధ్య శాంతి ప్రక్రియ చర్చలు పునఃప్రారంభిస్తామని తేల్చిచెప్పింది.

గత ఏడాది నవంబరులో జరిగిన ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియను భారత్ నిలిపివేసింది. తమ ఈ వైఖరినిలో ఎటువంటి మార్పు లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ తెలిపారు. భారత్‌ను దెబ్బతీయాలనుకుంటున్న తీవ్రవాద గ్రూపులపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. అప్పటివరకు చర్చలు ఉండవన్నారు.

పాకిస్థాన్ ప్రభుత్వం బేషరతు చర్చల పునరుద్ధరణను కోరుతుండటంపై స్పందిస్తూ ఎస్ఎం కృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే అంతకుముందు పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి అద్బుల్ బసీర్ మాట్లాడుతూ.. ఇరుదేశాలు ఒకదానినొకటి అర్థం చేసుకోవడానికి చర్చలు అవసరమన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments