Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ గిరిజన ప్రాంతంలో శాంతి ఒప్పందం రద్దు

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ప్రభుత్వం కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని తాలిబాన్ తీవ్రవాదులు రద్దు చేశారు. నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో పాకిస్థాన్ సైన్యం గత కొన్నివారాలుగా తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. స్వాత్ లోయలో తాలిబాన్ల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు పాక్ సైన్యం ఈ చర్యలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో తాలిబాన్ వర్గం పాకిస్థాన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని రద్దు చేసింది. తాజా దాడులు చేయడతామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే తాలిబాన్లపై చేపట్టిన సైనిక చర్యను చివరి వరకు కొనసాగిస్తామని పాక్ మిలిటరీ స్పష్టం చేసింది. తాజాగా ఉత్తర వజీరిస్థాన్‌లోని తీవ్రవాదులు పాక్ ప్రభుత్వంతో శాంతి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా డ్రోన్ దాడులు, పాక్ సైనిక చర్యలు తొమ్మిది సూత్రాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని తాలిబాన్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఉతమంజై గిరిజన పెద్దలు, పాక్ ప్రభుత్వం మధ్య ఈ ఒప్పందం కుదిరింది. అయితే తాజాగా దీనిని రద్దు చేసిన తాలిబాన్లు అమెరికా డ్రోన్ దాడులు ఆపేవరకు సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?