Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌ గిరిజన ప్రాంతాల్లో ఘర్షణలు: 14 మంది మృతి

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2009 (17:16 IST)
పాక్ గిరిజన ప్రాంతాల్లో చెలరేగిన ఘర్షణల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో యాంటీ తాలిబాన్ పీస్ కమిటీ చీఫ్ మాలిక్ అజ్మల్‌ ఖాన్‌తో సహా ఇదే గ్రూపునకు చెందిన మరో ముగ్గురు సభ్యులు కూడా ఉన్నట్టు అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. అలాగే, మరో పది మంది తాలిబాన్ అనుచరులు కూడా మరణించినట్టు తెలిపాయి.

మహ్మానంద్ గిరిజన ప్రాంతంలోని ఖవాజాయ్ సబ్ డివిజన్ ప్రాంతాల్లో జరిగిన శనివారం రాత్రి ఈ ఘర్షణలు చోటు చేసుకున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పది మంది తాలిబాన్ ఫైటర్స్ ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లో తెహ్రీక్ ఇ తాలిబాన్ సంస్థను నడుపుతున్న ఖాన్... అనేక మంత్రి తాలిబాన్ యువకులకు ఆశ్రయం కల్పించాడు.

అయితే, శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘర్షణల్లో ఖాన్‌తో పాటు.. మొత్తం 14 మంది మరణించినట్టు స్థానిక వర్గాలు వెల్లడించాయి. గిరిజన ప్రాంతాల్లో తాలిబాన్ తీవ్రవాద సంస్థ ఆగడాలను అరికట్టేందుకు పాక్ ప్రభుత్వం శాంతి కమిటీలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ఆరంభమయ్యాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments