Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో డ్రోన్ దాడులు: నలుగురి మృతి

Webdunia
పాక్‌లోని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికాకు చెందిన డ్రోన్ విమానం దాడులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనాయి.

ఉత్తర వజీరిస్థాన్ ఏజెన్సీ(ఎన్‍‌డబ్ల్యూఏ)లో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మీర్ అలీకి చెందిన నోరోక్ తహసీల్‌పై అనుమానాస్పదమైన అమెరికా డ్రోన్ విమానం దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ వార్తా సంస్థ "జియో న్యూస్" ఛానెల్ తెలిపింది.

అమెరికాకు చెందిన డ్రోన్ విమానం దాడులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఇందులో మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదని జియో సంస్థ పేర్కొంది.

ఇదిలావుండగా పాకిస్థాన్ ప్రభుత్వం తన సైనిక బలగాలతో దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలోని కబాయలీ క్షేత్రంలో స్థావరాలను ఏర్పరచుకునివున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు గత నెల 17 నుంచి ఆపరేషన్ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 400 మంది ఉగ్రవాదులు మృతి చెందారని, వీరితోపాటు మరో 37 మంది సైనికులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments