Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో ఆత్మాహుతి దాడి: 13 మంది మృతి

Webdunia
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని పేషావర్‌లో ఓ మసీదు వద్దనున్న పోలీసు భద్రతా కార్యాలయంపై కారుతో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 13 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలైనారు. శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో దేశంలో జరిగిన అతి పెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.

ఈ దాడులు మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగాయని, ఇందులో పోలీసు భవంతితోపాటు చాలా వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించినట్లు స్థానిక టీవీ ఛానెళ్ళు తెలిపాయి.

గురువారం పేషావర్‌లోనే జరిగిన దాడుల్లో ప్రభుత్వ అధికారులు నివసించే కాలనీలో మరో పేలుడు జరిగింది. ఇందులో ఓ పిల్లవాడు మృతి చెందగా మరో 10 మంది తీవ్ర గాయాలపాలైనారని పోలీసులు తెలిపారు.

పేషావర్‌లో శుక్రవారం జరిగిన దాడుల్లో దాదాపు 13 మంది మృతి చెందగా పలువురు తీవ్ర గాయాల పాలైనట్లు స్థానిక టీవీ ఛానెళ్ళు పేర్కొన్నాయి. దీంతోపాటు పేలుళ్ళు జరిగిన ప్రాంతంలోనే స్థానిక మసీదు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

ఇదిలావుండగా ఈ పేలుళ్ళకుగాను నలభై కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. ఒక వారం ముందు ఇదే పట్టణంలోని జనసమర్థం కలిగిన మార్కెట్లో ఓ వాహనం ద్వారా జరిపిన దాడుల్లోను దాదాపు 52 మంది మృతి చెందారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments