Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లోని ఐరాసపై దాడి మాపనేః తాలిబన్లు

Webdunia
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనున్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంవద్ద సోమవారం జరిపిన దాడులు మాపనేనని తెహరీక్-ఏ-తాలిబన్ ప్రకటించింది.

ఐరాస కార్యాలయానికి సమీపంలో సోమవారంనాడు దాడులకు పాల్పడింది తామేనని తాలిబన్ ప్రతినిధి ఆజమ్ తారిక్ మంగళవారం వెల్లడించారు. ఐరాస చేస్తున్న పనులు ముస్లింలకు మేలు చేసేటివిగా లేవని, ఐరాస మరియు విదేశీ సహాయకరమైన ఏజెన్సీలు ముస్లిమేతరులని, ఇవన్నీ కూడా అమెరికాకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని, ఈ కారణంగానే తాము ఆ సంస్థపై దాడులకు పాల్పడ్డామని ఆయన వివరించారు.

సోమవారం జరిగిన దాడుల్లో నలుగురు పాకిస్థానీయులు, ఒకరు ఇరాక్ దేశానికి చెందినవారుగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలుండటం గమనార్హం.

ఇదిలావుండగా సోమవారం జరిగిన దాడుల కారణంగా నిరవధికంగా పాక్‌లోని ఐరాస కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments