Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు కఠిన సందేశం పంపిన మన్మోహన్

Webdunia
భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనను ముగించుకొని బుధవారం స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో పాల్గొనేందుకు మన్మోహన్ సింగ్ రష్యా వెళ్లారు. ఈ సదస్సులో భాగంగా పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో సమావేశమయ్యారు.

ముంబయి ఉగ్రవాద దాడులు జరిగిన అనంతరం పాకిస్థాన్ అధ్యక్షుడిని మన్మోహన్ సింగ్ కలుసుకోవడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రిగా ఇటీవల రెండోసారి బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ తన తొలి విదేశీ పర్యటనలో పాకిస్థాన్‌కు తీవ్రవాదం విషయంలో కఠిన సందేశం పంపేందుకు ఉపయోగించుకున్నారు.

భారత్‌పై జరుగుతున్న ఉగ్రవాద దాడులకు పాకిస్థాన్ ప్రభుత్వం వారి భూభాగం ఉపయోగపడకుండా చూడాలని జర్దారీకి మన్మోహన్ సింగ్ తేల్చిచెప్పారు. జర్దారీని కలుసుకున్నందుకు మొదట సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని, ఆ వెంటనే పైసందేశాన్ని స్పష్టీకరించారు. మీకు చెప్పాలనుకుంటున్న సందేశం ఇదొక్కటేనని పేర్కొన్నారు. జర్దారీ, మన్మోహన్ సింగ్ సమావేశం టీవీ కెమేరాల ఎదుటే జరగడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments