Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో బాంబు పేలుడు: 40 మంది మృతి

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఓ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది మృతి చెందారు. పాక్ వాయువ్య ప్రాంతంలోని ఓ మారుమూల ప్రదేశంలో ఈ దాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రార్థనకు వచ్చినవారిని లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు ఈ బాంబు దాడి చేశారు.

దాడిలో గాయపడినవారిపై ఎటువంటి సమాచారం లేదని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ ఎగువ దీర్ జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే అంతకుముందు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో, దాని సమీపంలోని రావల్పిండిలో పోలీసులు ఆత్మాహుతి దళ సభ్యులను అరెస్టు చేశారు.

మరోవైపు స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులను తుడిచిపెట్టిన అనంతరం ఏం చేయాలనే దానిపై ప్రస్తుతం పాక్ పర్యటనలోనే ఉన్న అమెరికా ప్రత్యేక రాయబారి రిచర్డ్ హోల్‌బ్రూక్ తమ దేశ నేతలతో చర్చలు జరిపినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments