Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో డ్రోన్ దాడులు: 12మంది మృతి

Webdunia
పాకిస్థాన్‌లో డ్రోన్ విమానం జరిపిన దాడులలో దాదాపు 12 మంది మృతి చెందారు.

పాకిస్థాన్‌లో అమెరికాకు చెందిన డ్రోన్ (మానవ రహిత) విమానం దాడులకు పాల్పడింది. ఇది ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోనున్న ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో ఒసామా బిన్ లాడెన్ తల దాచుకున్న ప్రాంతంలో రెండు మిస్సైళ్ళు పడ్డాయి. దీంతో అక్కడున్న 12 మంది మృతి చెందారు.

ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లోనున్న ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో లాడెన్ తలదాచుకున్నాడన్న అనుమానంతో అక్కడ అమెరికాకు చెందిన డ్రోన్ విమానం దాడులకు పాల్పడింది. ఈ వారంలో అమెరికా ఇలా దాడులకు పాల్పడడం మూడవసారి.

డ్రోన్ విమానం నుంచి మిస్సైళ్ళు నేలపై పడటంతో ఒళ్ళు గగుర్పొడిచే భయంకరమైన విస్ఫోటనం జరిగింది. దీంతో తమ తలుపులు పడిపోయాయని, ఇక్కడ జరిగిన విస్ఫోటనం తర్వాత ఆకాశంలో డ్రోన్ విమానం ఎగురుతూ కనపడిందని స్థానికులు తెలిపారు.

ఓ ఇంటిపై జరిగిన ఈ దాడులలో అందులోనున్న 12 మంది మృతి చెందినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. మృతి చెందిన వారిలో ఎక్కువమంది ఆఫ్గనిస్థానీయులున్నారని వారు పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments