Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఆరుగురు తీవ్రవాదులు హతం

Webdunia
పాకిస్థాన్ యుద్ధ విమానాలు దేశ వాయువ్య ప్రాంతంలో అనుమానిత తాలిబాన్ తీవ్రవాద స్థావరంపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆరుగురు తాలిబాన్ తీవ్రవాదులు మృతి చెందారని నిఘా అధికారులు తెలిపారు. శనివారం ఉదయం పాకిస్థాన్ యుద్ధ విమానంలో సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లోని తీవ్రవాద స్థావరంపై దాడి చేశాయని చెప్పారు.

ఈ ప్రావీన్స్‌లోని పలు గిరిజన ప్రాంతాల్లో పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్, అతని ప్రధాన అనుచరులను పట్టుకునేందుకు సైనికులు గత కొన్నివారాలుగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పాక్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో ప్రధాని నిందితుడు బైతుల్లా మెహసూద్ అయిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడులకు కూడా ఇతనే సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. శనివారం ఎగువ ఒరాక్‌జై ప్రాంతంలో జరిపిన వైమానిక దాడుల్లో మెహసూద్ డిప్యూటీ హాకీం ఉల్లా రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో అతను అక్కడ ఉన్నాడో లేదో తెలియరాలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments