Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మనాథన్‌పై విచారణ జరిపిస్తాం: శ్రీలంక

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2009 (11:42 IST)
ఎల్టీటీఈ కొత్త చీఫ్ పద్మనాథన్‌పై విచారణ జరిపించనున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. గత గురువారం థాయ్‌లాండ్‌లో ఇంటర్‌పోల్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. భారత పాస్‌ పోర్టుతో సహా వివిధ దేశాల పాస్‌పోర్టులు ఉన్నప్పటికీ, అతడిపై శ్రీలంక చట్టాల ప్రకారం విచారణ జరిపిస్తామని విదేశాంగ మంత్రి రోహితా బొగుళ్ళగామా వెల్లడించారు.

ఇప్పటికే చావుదెబ్బ తిన్న ఎల్టీటీఈకి.. తాజాగా పద్మనాథన్ అరెస్టు కావడం చెప్పుకోదగిన విజయమని విదేశాంగ మంత్రి అభివర్ణించారు. పద్మనాథన్‌ని ఇక్కడికి తీసుకుని వచ్చినట్టు శ్రీలంక రక్షణ శాఖ ప్రతినిధి కెచెలియా రాంబక్వెల్లా విలేఖరులతో తెలిపారు.

ప్రస్తుతం ఆయన రక్షణ శాఖ అధికారుల కస్టడీలో ఉన్నారని చెప్పారు. పద్మనాథన్ శ్రీలంక జాతీయుడని, అందువల్ల తమ దేశ చట్టాల ప్రకారమే ఆయనపై విచారణ జరుగుతుందని శ్రీలంక అధికారులు తేల్చి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments