Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు 24న ప్రధానికి ఒబామా దంపతుల విందు!

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2009 (10:22 IST)
వచ్చే నెల 24వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. శ్వేతసౌథంలో ఒబామా అడుగుపెట్టిన తర్వాత ఒక దేశాధినేతకు విందు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఒబామా ఆహ్వానం మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబరులో అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, సత్‌సంబంధాలు పటిష్టతకు మరింతగా దోహదపడనుంది. 24వ తేదీన వాషింగ్టన్‌కు చేరుకునే ప్రధానికి బరాక్‌ ఒబామా దంపతులు స్వయంగా శ్వేత సౌధంలోకి ఆహ్వానించనున్నారు.

ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్‌ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అదే రోజు సాయంత్రం ఒబామా దంపతులు మన్మోహన్‌సింగ్‌ దంపతులకు అధికారిక విందునిస్తారని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి రాబర్ట్‌ గిబ్స్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఒబామా హయాంలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అమెరికాలో జరుపననున్న ఈ తొలి పర్యటన ఇదే.

ఈ పర్యటన ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు వేదికకానుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం జరిగే ఈ భేటీలో అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ద్వైపాక్షిక సంబంధాలపై ఒబామా, మన్మోహన్‌లు చర్చించే అవకాశాలున్నాయని గిబ్స్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments