Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని అస్థిరపరిచేందుకు దాడులు: సుసిలో

Webdunia
ఇండోనేషియా రాజధాని జకార్తాలో శుక్రవారం రెండు లగ్జరీ హోటళ్లలో సంభవించిన బాంబు పేలుళ్లపై ఆ దేశ అధ్యక్షుడు సుసిలో బంబాంగ్ యుధోయోనో మాట్లాడుతూ.. దేశాన్ని అస్థిరపరిచేందుకే ఉగ్రవాదులు దాడులకు కుట్రపన్నుతున్నారన్నారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలకు సమాచారం ఉందని తెలిపారు.

అంతేకాకుండా తనను హత్య చేసేందుకు కూడా కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం హోటళ్లలో సంభవించిన బాంబు పేలుళ్లపై కూడా ఈ కోణంలో దర్యాప్తు జరపాలని అధికారిక యంత్రాంగాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు కోరారు. జకార్తాలోని జేడబ్ల్యూ మారియట్, దీనికి సమీపంలోని రిట్జ్ కార్ల్‌టన్ హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి.

ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. సుసీలో ఈ బాంబు పేలుళ్లను తీవ్రంగా ఖండించారు. వీటిని కిరాతకమైన ఉగ్రవాద చర్యగా వర్ణించారు. ఈ పేలుళ్ల వెనుక ఉన్న కుట్రదారులను పట్టుకొని, చట్టం ముందు నిలబెడతామని చెప్పాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments