Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో ఇరాక్ నుంచి వైదొలగనున్న అమెరికా సేనలు!

Webdunia
మరికొద్ది నెలల్లో అమెరికా దళాలు ఇరాక్ నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి. దీంతో తీవ్రవాదులు మరింతగా పెట్రేగి పోతున్నారు. సోమవారం వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న అల్లర్లలో 47 మంది మరణించారు. దేశంలోని మొత్తం 10 నగరాల్లో దాడులు, విధ్వంసకాండ కొనసాగుతున్న హింసాకాండలో 160 మంది గాయపడ్డారు. విచ్చలవిడి దాడులు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి.

దీంతో ఇరాక్ భద్రతాదళాల సమర్థతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది చివరిలోగా అమెరికా దళాలు ఇరాక్‌ నుంచి వైదొలగనున్న నేపథ్యంలో ఇరాక్‌లో తీవ్ర స్థాయిలో విధ్వంసకాండ చెలరేగడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. దీంతో ఇరాక్‌ మిలిటరీ దళాలకు ఇచ్చే శిక్షణా కార్యక్రమాలను మరికొంత కాలం పొడిగించాలన్న తలంపుతో అమెరికా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా, దక్షిణ ఇరాక్‌కు చెందిన కుట్ నగరంలో సోమవారం జరిగిన రెండు వరుస బాంబుపేలుడు సంఘటనల్లో మొత్తం 34 మంది మరణించారు. అయితే దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న హింసాకాండలో సోమవారం మరణించిన వారి సంఖ్య 66కు చేరుకుంది. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కుట్ నగరం నడిబొడ్డున, రోడ్డుపక్కనే ఉంచిన బాంబు పేలింది. మరికొద్ది నిముషాల వ్యవధిలోనే సమీపంలో మరో కారుబాంబు పేలినట్టు వైద్య, భద్రతాధికార్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments