Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైవాన్‌లో తుపాను మృతుల సంఖ్య 292

Webdunia
తైవాన్‌లో ఇటీవల విలయతాండవం చేసిన మొరాకోత్ తుపాను కారణంగా 292 మంది మృతి చెందారని ఆ దేశ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. మొరాకోత్ తుపాను కారణంగా తైవాన్‌లో భారీ వర్షాలు కురవడంతో పెద్దఎత్తున వరదలు సంభవించాయి. వరదల కారణంగా లక్షలాది మంది పౌరులు నిరాశ్రయాలయ్యారు.

అధికారిక యంత్రాంగం ఇప్పటివరకు 500 మందికిపైగా పౌరులు వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మృతి చెంది ఉంటారని అంచనా వేసింది. అయితే తాజాగా తైవాన్ ప్రభుత్వం మృతుల సంఖ్య 292గా ప్రకటించింది. ఇప్పటికీ 385 ఆచూకీ తెలియరాలేదని వెల్లడించింది. తైవాన్ గత అర శతాబ్దకాలంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద భీభత్సాన్ని చూడలేదు.

ఇదిలా ఉంటే దక్షిణ తైవాన్‌లోని సియావోలిన్ అనే గ్రామం భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పూర్తిగా భూస్థాపితమైంది. ఈ గ్రామంలో 311 మంది పౌరుల ఆచూకీ గల్లంతైంది. వీరిని కూడా తాజా గణాంకాల్లో చేర్చామని తైవాన్ జాతీయ అగ్నిమాపక సంస్థ (ఎన్ఎఫ్ఏ) తెలిపింది. తైవాన్‌లో మొరాకోత్ తుపాను కారణంగా మూడు మీటర్ల వర్షపాతం నమోదయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments