Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబాన్ల చెర నుంచి 80 మంది విడుదల

Webdunia
తాలిబాన్ తీవ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న 80 మందిని పాకిస్థాన్ ఆర్మీ విడిపించింది. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో సోమవారం తాలిబాన్ తీవ్రవాదులు వీరిని బందీలుగా తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో 80 మందిని విడిపించామని పాకిస్థాన్ ఆర్మీ మంగళవారం వెల్లడించింది.

వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో చోటుచేసుకున్న కిడ్నాప్ డ్రామాకు ఈ రోజు తెరపడిందని, 80 మంది కాడెట్ కళాశాల విద్యార్థులు, సిబ్బందిని తాలిబాన్ల చెర నుండి విడిపించామని ఆర్మీ ప్రతినిధులు తెలిపారు. రాజ్‌మక్ కాడెట్ కళాశాలలో 71 మంది విద్యార్థులు, 9 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు.

వీరిని విడిపించే ప్రయత్నాల్లో భాగంగా తాలిబాన్ తీవ్రవాదులకు, ఆర్మీ సిబ్బంది మధ్య ఉత్తర వజీరిస్థాన్‌లోని రాజ్‌మక్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘారియం వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. కిడ్నాప్ చేసిన విద్యార్థులను, సిబ్బందిని నాలుగు నుంచి ఐదు కార్లలో తాలిబాన్లు దక్షిణ వజీరిస్థాన్‌ తీసుకెళుతుండగా ఆర్మీ సిబ్బంది వారిని అడ్డగించి విడిపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments