Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబాన్లపై పాక్ సైన్యం పోరుకు అడ్డునిలుస్తాం

Webdunia
పాకిస్థాన్‌లోని మరో సమస్యాత్మక బూలిచిస్థాన్ ప్రాంతంలో వేర్పాటువాదులు తాలిబాన్ తీవ్రవాదులపై జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్‌కు అడ్డుతగులుతామని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, తాలిబాన్లపై పాకిస్థాన్ ప్రభుత్వం సాగిస్తున్న సైనిక పోరుకు తాము ఆటంకాలు సృష్టిస్తామని బలూచిస్థాన్ వేర్పాటువాదులు పేర్కొన్నట్లు ఓ బ్రిటన్ పత్రిక వెల్లడించింది.

పాకిస్థాన్ నైరుతీ ప్రావీన్స్‌లో గత కొన్ని దశాబ్దాలుగా వేర్పాటువాద ఉద్యమం జరుగుతోంది. అయితే ఇది చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం దీనిపై కలవరపడటం లేదు. బలూచీస్థాన్ ప్రత్యేక ప్రాంతాన్ని డిమాండ్ చేస్తూ పోరాటం సాగిస్తున్న నేతలు తాజాగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలోనే అతిపెద్ద గ్యాసు నిక్షేపాలు బలూచిస్థాన్ ప్రాంతంలోనే ఉన్నాయి.

వీటిలో తమ ప్రాంత ప్రజలకు పాక్ కేంద్ర సర్కాలు వాటా కల్పించడం లేదని, తమ పౌరులకు దక్కాల్సిన సంపదను ప్రభుత్వం దూరం చేస్తుందని బలూచిస్థాన్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోరాడుతూ అశాంతిని సృష్టిస్తున్న వేర్పాటువాదులు తాజాగా తాలిబాన్లపై పాక్ సైన్యం సాగిస్తున్న పోరుకు అడ్డుగా నిలిస్తామని హెచ్చరించారు.

సమస్యాత్మక ఆప్ఘనిస్థాన్ సరిహద్దులను పంచుకుంటున్న బలూచిస్థాన్ ప్రాంతం గుండా పాక్ సైన్యానికి ఆటంకం కలిగిస్తామని వేర్పాటువాదులు చెప్పినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ఇప్పటికీ పంజాబ్ ప్రాంతానికి చెందిన పౌరులను తమ ప్రాంతం విడిచివెళ్లాలని బలూచిస్థాన్ వేర్పాటువాదులు బహిరంగంగానే హెచ్చరిస్తారు.

తమ ప్రాంతాన్ని విడిచివెళ్లకపోతే, శవాలను వెనక్కు పంపుతామని వారు బెదిరిస్తున్నారు. అందరూ స్వాత్ లోయ గురించి విచారం చెందుతున్నారు. బలూచిస్థాన్ కూడా నియంత్రణ తప్పుతోందని పాకిస్థాన్ సీనియర్ భద్రతాధికారి ఒకరు ఈ బ్రిటీష్ వార్తాపత్రికతో చెప్పారు. బలూచిస్థాన్ ప్రాంతంలో సుస్థిరత లేకుండా, ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులను బాగు చేయడం సాధ్యం కాదని పశ్చిమ దేశాల దౌత్యాధికారులు కూడా భావిస్తున్నారు.

పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో సుస్థిరత రావాలంటే బలూచిస్థాన్ ప్రాంతంలో వేర్పాటువాదులను శాంతిపజేయడం ఎంతో ముఖ్యం. ఇప్పటికే బలూచిస్థాన్ ప్రాంతంలో నెలకొన్న అశాంతి కారణంగా చైనా ఇక్కడ నిర్మించతలపెట్టిన చమురు రిఫైనరీ నిర్మాణాన్ని వాయిదా వేసుకుంది. గ్వాదర్‌లో పాకిస్థాన్‌లోనే అతిపెద్ద రిఫైనరీని నిర్మించేందుకు చైనా ముందుకొచ్చింది. అయితే ఇక్కడ అశాంతి కారణంగా చైనా ఈ ప్రణాళికలను నిలిపివేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments