Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిన్‌జియాంగ్ అల్లర్లు: 140కి పెరిగిన మృతులు

Webdunia
పశ్చిమ చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంత రాజధానిలో జరిగిన హింసాత్మక అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య 140కి పెరిగింది. ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ అల్లర్లలో మరో 800 మంది గాయపడ్డారు. జిన్‌జియాంగ్ రాజధాని ఉరుంఖీలో ఆందోళనకారులు ఆదివారం వీధుల్లోకి వచ్చి విధ్వంసక చర్యలకు పాల్పడ్డారు.

ఓ ముస్లిం వర్గానికి చెందిన ఆందోళనకారులు ఇతర పౌరులు, భద్రతా దళాలపై దాడులు చేశారు. దీనికి సంబంధించి జరిగిన ఘర్షణల్లో 140 మంది మృతి చెందారని చైనా పాక్షిక అధికార వార్తా సంస్థ ఒకటి వెల్లడించింది. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు.

గత నెలలో దక్షిణ చైనాలోని ఓ కర్మాగారంలో రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ కర్మాగారంలో హాన్ చైనీస్, ఉయ్‌ఘుర్ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ ఉయ్‌ఘుర్ వర్గానికి చెందిన ఆందోళనకారులు ఆదివారం ఉరుంఖీ వీధుల్లోకి విధ్వంసానికి పాల్పడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments