Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్ధారీ కేసుల పునర్విచారణపై ప్రధాని విఫలం : పాక్ కోర్టు

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2012 (10:05 IST)
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీపై నమోదైన అవినీతి కేసులపై పునర్విచారణకు ఆదేశించే విషయంలో ఆ దేశ ప్రధాన రజా పర్వేజ్ అష్రాఫ్ విఫలమయ్యారు. దీనిపై పాకిస్థాన్ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీసు జారీ చేసింది.

తమ ఆదేశాల అమలు వైఫల్యంపై ఈ నెల 27వ తేదీలోగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రధానిని ఆదేశించింది. 2007లో పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు మూసివేసిన ఈ కేసులను పునర్విచారణ చేయాలంటూ స్విస్‌ అధికారులకు లేఖ రాయాలని ప్రధానిని ఆదేశించిన సుప్రీంకోర్టు ఇందుకు రెండు వారాల గడువునిచ్చింది.

అయితే, జర్దారీపై నమోదైన కేసుల విచారణను సెప్టెంబర్‌ నెల వరకు వాయిదా వేయాలంటూ పాక్‌ అటార్నీ జనరల్‌ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి ఆసిఫ్‌ సయీద్‌ ఖోసా తోసిపుచ్చారు. జర్దారీ కేసుల పునర్విచారణపై సుప్రీం ఆదేశాలను అమలు చేయనందునే గత ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments