జపాన్లో తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ పశ్చిమ భాగంగా భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 11 మంది ఆచూకీ గల్లతైంది. తుపాను హోన్షు ద్వీపాన్ని సమీపిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పశ్చిమ హైగో ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృతి చెందారని స్థానిక పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉంటే పొరుగునున్న ఒకయామా ప్రాంతంలో 68 ఏళ్ల మహిళ ఒకరు కొండచరియలు విరిగిపడి మృతి చెందారు. గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఎటావు తుపాను హోన్షుని సమీపిస్తోంది. సోమవారం ఉదయం 7.45 గంటల సమయంలో షికోకు ద్వీపానికి నైరుతీ దిశగా 390 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని అధికారిక వర్గాలు చెప్పాయి.