Webdunia - Bharat's app for daily news and videos

Install App

జకార్తా బాంబర్లను గుర్తించిన టీవీ ఛానల్

Webdunia
ఇండోనేషియా రాజధాని జకార్తాలో రెండు లగ్జరీ హోటళ్లలో శుక్రవారం ఉదయం జరిగిన బాంబు దాడుల్లో పాల్గొన్న ఓ అనుమానితుడిని ఆ దేశానికి చెందిన ఓ టీవీ ఛానల్ గుర్తించింది. మారియట్, రిడ్జ్- కార్ల్‌టన్ హోటళ్లపై జరిగిన బాంబు దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, 60 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ ఆత్మాహుతి దాడుల అనుమానితుడిని గుర్తించామని మెట్రో టీవీ ఛానల్ వెల్లడించింది. ఈ అనుమానితుడికి అతివాద ఇస్లామిక్ గ్రూపు జెమాహ్ ఇస్లామియా సభ్యులతో పాఠశాల సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే ఇండోనేషియా పోలీసులు హోటళ్లపై జరిగిన దాడులకు జెమాహ్ ఇస్లామియా ప్రధాన సూత్రధారి అయివుండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఓ ఆత్మాహుతి దళ సభ్యుడిని పోలీసులు ఎన్‌గా గుర్తించారు. అతనికి సంబంధించిన వివరాలేమీ వెల్లడించలేదు. అయితే మెట్రో టీప్ (ప్రైవేట్ టీవీ ఛానల్) పోలీసులు గుర్తించిన అనుమానితుడిని నుర్హాస్బిగా పేర్కొంది. అతని కుటుంబసభ్యులు నుర్హాస్బి కనిపించడం లేదని, ఫోన్‌లోనూ అందుబాటులో లేడని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments