చైనాలోని ఉరుంఖీ నగరానికి వెళుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కాందహార్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సివచ్చింది. కాబూల్ నుంచి ఉరుంఖీ బయలుదేరిన ఈ విమానంలో యాంత్రికలోపం తలెత్తడంతో ఆదివారం రాత్రి కాందహార్లో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ విమానంలో 200 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్న కామ్ ఎయిర్లైన్స్ బోయింగ్ 767 విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణమని కామ్ ఎయిర్లైన్స్ అధ్యక్షుడు జమరై కామ్గర్ తెలిపారు. ఇదిలా ఉంటే దీనికి ముందు బాంబు బెదిరింపు కారణంగా ఇది అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
మీడియాలో భిన్న కథనాలు వెలువడిన అనంతరం విమానంలో యాంత్రికలోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు వివరణ ఇచ్చాయి. కాందహార్ నుంచి ఈ విమానాన్ని తిరిగి కాబూల్కు మళ్లించారు. కాబుల్- ఉరుంఖీ నగరాల మధ్య కామ్ ఎయిర్లైన్స్ నడుపుతున్న తొలి విమానం ఇదే కావడం గమనార్హం.