Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా దృష్టిలో జైషే చీఫ్ మసూద్ తీవ్రవాది కాదు

Webdunia
భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్న జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మౌలానా అజహర్‌ను తీవ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనను చైనా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేత జైషే మొహమ్మద్‌ను తీవ్రవాద సంస్థగా, దాని అధిపతిని తీవ్రవాదిగా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చేందుకు చైనా మాత్రం నిరాకరించింది. జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థపై ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన ఈ ప్రతిపాదనను చైనా ప్రభుత్వం తోసిపుచ్చింది. భారత జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్, చైనా విదేశాంగ శాఖ కౌన్సిలర్ దైబింగూ మధ్య ఇటీవల ఈ అంశంపై చర్చలు జరిగాయి.

పాకిస్థాన్‌కు చెందిన ఈ తీవ్రవాద సంస్థపై నిషేధం విధించేందుకు సాంకేతిక కారణాల వలన చైనా మద్దతు తెలపడం లేదు. జైషే మొహమ్మద్‌పై నిషేధం విధించేందుకు తాము చేసిన ప్రతిపాదనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కారణాలు వివరించాలని భారత్ ఈ ఏడాది జులైలో చైనా ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సాంకేతిక కారణాలను చైనా సాకుగా చూపినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments