Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ప్లేగు వ్యాధి బారినపడి ముగ్గురి మృతి

Webdunia
వాయువ్య చైనాలో ప్లేగు వ్యాధి బారినపడి మృతి చెందినవారి సంఖ్య 3కి చేరుకుంది. స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్వాసకోశాలకు సంబంధించిన ప్లేగు ప్రబలడంతో జికెటన్ పట్టణంలో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది పట్టణంలో వ్యాధి కొత్తవారికి వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

తాజాగా జికెటన్ పట్టణంలో ప్లేగు కారణంగా మృతి చెందిన వ్కక్తిని డాంజి (64)గా గుర్తించారు. స్వయంప్రతిపత్తి కలిగిన హైనాన్ టిబెట్ ప్రాంతంలో ఈ పట్టణం ఉంది. ఈ పట్టణంలో సుమారు పది వేల మంది పౌరులు నివసిస్తున్నారు. గత గురువారం ఇక్కడ ప్లేగు వ్యాధి వెలుగుచూసింది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు వ్యాధి కారణంగా మృతి చెందారు.

తాజాగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని అధికారిక వర్గాలు చెప్పాయి. మరో తొమ్మిది మందిలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నిమోనిక్ ప్లేగు అనే ఈ భయానక వ్యాధి చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు అది ఇంకొకరి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వ్యక్తికి సరైన చికిత్స అందించకపోతే, 24 గంటల్లోగానే మరణం ముంచుకొస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments