Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చలు విఫలం: ప్రమాదంలో నేపాల్ శాంతి ప్రక్రియ

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2009 (12:08 IST)
నేపాల్‌లో రాజకీయ పరిణామాలు మరోమారు అస్థిరతకు దారితీస్తున్నాయి. నేపాల్ ప్రధాని మాధవకుమార్‌, మావోయిస్టు చీఫ్ ప్రచండల మధ్య శనివారం జరిగిన చర్చలు విఫమయ్యాయి. దీంతో మావోయిస్టులు, 11 రాజకీయ పార్టీల మధ్య గతంలో కుదిరిన శాంతి ప్రక్రియకు విఘాతం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, చర్చల విఫలం కావడంతో పార్లమెంటును స్థంభింపచేసే కార్యక్రమాన్ని కొనసాగించాలని మావోయిస్టులు సంకల్పించారు.

ఫలితంగా వచ్చే వేసవిలో కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చే ప్రక్రియకు విఘాతం ఏర్పడనుంది. ఇదిలావుండగా, బ్రిటన్‌కు వెళ్లేముందు మాజీ ప్రధాని ప్రచండ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో చర్చకు అనువైన పరిస్థితి కల్పించేందుకు ప్రధానమంత్రి అంగీకరిస్తే మా నిరసనను ఉపసంహరించు కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదన్నారు. నేపాల్ సైనికదళ ప్రధానాధికారి జెనరల్ రుక్మాంగద్ కటవాల్‌తో గొడవ కారణంగా ఎనిమిది నెలల మవోయిస్టు ప్రభ్వుం మే నెలలో అధికారం నుంచి దిగిపోయిన విషయం తెల్సిందే. అప్పటి నుంచీ ఈ అంశంపై పార్లమెంటులో చర్చకోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments