Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్ బ్యాంకులోకి చొరబడ్డ సాయుధులు

Webdunia
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ తీవ్రవాదుల వరుసగా దాడులకు తెగబడుతున్నారు. కాబూల్‌లో మంగళవారం తాలిబాన్లు చేసిన బాంబు దాడుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే బుధవారం ముగ్గురు సాయుధులు సెంట్రల్ కాబూల్‌లోని ఓ బ్యాంకులోకి చొరబడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 20న ఆఫ్ఘనిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తాలిబాన్లు ఇటీవల కాలంలో వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని ఇప్పటికే వారు పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు.

ఈ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన వరుస దాడుల్లో భాగంగానే కాబూల్ బ్యాంకులోకి తాజాగా తమ సాయుధులు చొరబడ్డారని తాలిబాన్ ప్రతినిధులు తెలిపారు. సాయుధులు ఆధీనంలోకి తీసుకున్న బ్యాంకును పోలీసులు చుట్టుముట్టారు. బ్యాంకులో చొరబడినవారు దొంగలు అయి ఉంటారని ఆఫ్ఘన్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది తాలిబాన్ల తీవ్రవాద చర్య కాదని కొట్టిపారేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సివుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments