Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీ సంక్షోభం: స్పందించిన పాకిస్థాన్ సుప్రీం కోర్టు

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2011 (11:24 IST)
పాకిస్థాన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ ఛౌధరీ ఆ దేశ వాణిజ్య రాజధాని కరాచీలో జరుగుతున్న హింసపై స్పందించి సుమోటా కేసుగా స్వీకరించారు. హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఫూటేజ్‌ను అందించాలని వార్తా ఛానళ్లను ఆదేశించారు.


దేశ అతిపెద్ద నగరంలో జరుగుతున్న హత్యలపై ఛీఫ్ జస్టిస్ స్పందించాలని పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన లేఖపై ఛౌధరీ స్పందించారు. ఈ లేఖ మానవ హక్కుల కేసుగా మారినట్లు పాక్ సర్వోన్నత న్యాయస్థాన అధికారులు వెల్లడించారు. నగరంలో హింసకు సంబంధించిన దృశ్యాలను అందించాలని కోరిన ప్రధాన న్యాయమూర్తి కరాచీ అశాంతిపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

గత వారం జరిగిన హింసలో కరాచీలో సుమారు వందమంది చనిపోయారు. కిడ్నాపులు, మర్డర్లు చోటుచేసుకొన్నాయి. పోర్ట్ సిటీలో హింస కట్టడికి అధికారులకు ఆదేశాలు జారీచేయాలని సింధ్ హైకోర్టులో ఇప్పటికే పిటీషన్ దాఖలైంది. 2011 తొలి ఆరు నెలల్లో 490 మంది ప్రజలు చనిపోయినట్లు పాకిస్థాన్ మానవహక్కుల సంఘం వెల్లడించింది. 2010 మొత్తం మీద 748 మంది మరణించారు. ఇవి అన్ని పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న హత్యలని మానవహక్కుల సంఘం ఆరోపించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments