Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలో మెహసూద్ ముఖ్య అనుచరుల హతం

Webdunia
పాకిస్థాన్ తాలిబాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మెహసూద్ ముఖ్య అనుచరులు ఐదుగురు కరాచీలో హతమయ్యారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో బైతుల్లా మెహసూద్ ముఖ్య అనుచరులు మృతి చెందారని అధికారిక వర్గాలు తెలిపాయి. కరాచీలోని ఓ తీవ్రవాద స్థావరంపై పోలీసులు అనూహ్యంగా దాడి చేశారు.

ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మోహసూద్ ముఖ్య అనుచరులుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులు హతమయ్యారు. గడాప్ పట్టణంలోని ఓ రహస్య తీవ్రవాద స్థావరంలో ఉన్న వీరిని పోలీసులు మొదట లొంగిపోవాలని ఆదేశించారు.

అయితే వారు కాల్పులకు దిగడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ నుంచి ఐదుగురు తీవ్రవాదులు తప్పించుకొని పరారయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

పాకిస్థాన్, అమెరికా ప్రభుత్వాలకు మోస్ట్‌వాంటెడ్ తీవ్రవాది అయిన బైతుల్లా మెహసూద్‌కు ఎన్‌కౌంటర్‌లో మరణించిన తీవ్రవాదులు ముఖ్య అనుచరులని కరాచీ నగర పోలీసు కమిషనర్ వాసీం అహ్మద్ గత రాత్రి విలేకరులతో చెప్పారు. దాడి చేసిన ప్రదేశం నుంచి పెద్దఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments