Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎఫ్ విమాన ప్రమాదం: 228 మంది మృతి

Webdunia
ఎయిర్ ఫ్రాన్స్ (ఏఎఫ్)కు చెందిన విమానం ఒకటి అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవడంతో 228 మంది దుర్మరణం చెందారు. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వస్తున్న ఈ విమానం మార్గమధ్యంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 228 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

తుపానులో చిక్కుకోవడం, పిడుగుపాటుకు గురికావడమే విమానం కూలిపోవడానికి కారణాలని అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. రియో డి జెనీరోలో టేకాఫ్ తీసుకున్న నాలుగు గంటల తరువాత విమానం తుపానులో చిక్కుకుందని ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది. విమానంలో విద్యుత్ సర్క్యూట్‌లో లోపం తలెత్తినట్లు చివరి సంకేతాలు అందాయి.

అనంతరం రాడార్ తెర నుంచి అదృశ్యమైన ఈ విమానం తుపానులో చిక్కుకుంది. విమాన శకలాల కోసం బ్రెజిల్, ఫ్రాన్స్ దేశాల వైమానిక దళాలు గాలిస్తున్నాయి. ఎయిర్ ఫ్రాన్స్ చరిత్రలో ఇదే ఘోర ప్రమాదం. ఇంత మంది ప్రయాణికులు గతంలో ఎన్నడూ చనిపోలేదు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments