Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమర్జెన్సీ విధింపుపై ముషారఫ్‌కు సమన్లు

Webdunia
పాకిస్థాన్ సుప్రీంకోర్టు బుధవారం 2007 నవంబరులో దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమయంలో ముషారఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి న్యాయబద్ధతను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తాజాగా ముషారఫ్‌కు సమన్లు జారీ చేసింది.

పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి నేతృత్వంలోని 14 మంది సభ్యుల ధర్మాసనం ముషారఫ్ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని సమర్థిస్తూ గతంలో వెలువడిన తీర్పుపై పునర్విచారణ ప్రారంభించింది. గతంలో ముషారఫ్ నియమించిన న్యాయమూర్తులు అత్యాయిక పరిస్థితి (ఎమర్జెన్సీ), న్యాయమూర్తులను తొలగించడానికి సంబంధించిన నిర్ణయాలకు న్యాయబద్ధత ఉందని తీర్పు చెప్పారు.

తాజాగా ఈ తీర్పుపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు పునర్విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జులై 29న ముషారఫ్‌ను స్వయంగా లేదా న్యాయమూర్తి ద్వారా కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజున ఈ కేసుపై తదుపరి విచారణ జరుగుతుంది. ఇదిలా ఉంటే అటార్నీ జనరల్ లతీఫ్ ఖోసా మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతోపాటు, మాజీ అధ్యక్షుడికి ప్రభుత్వం ఏరకంగా ప్రాతినిధ్యం వహించబోదని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?