Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియా ఆధీనంలో ద కొరియా బోటు

Webdunia
దక్షిణ కొరియాకు చెందిన నౌకను ఒకదానిని ఉత్తర కొరియా ఆధీనంలోకి తీసుకుంది. తమ దేశ జలాల్లోకి ప్రవేశించిన కారణంగా ఉత్తర కొరియా చేపలు పట్టే బోటును, అందులోని నలుగురు సిబ్బందిని నిర్బంధించింది. అనుకోకుండా ఈ నౌక దేశ తీర్పు జల సరిహద్దును అతిక్రమించిందని దక్షిణ కొరియా అధికారిక యంత్రాంగం తెలిపింది.

దీనిని సాధ్యమైనంత త్వరగా విడిచిపెట్టాలని కోరింది. గురువారం దక్షిణ కొరియా అధికారిక యంత్రాంగం ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఉత్తర కొరియా వివాదాస్పద అణు కార్యక్రమం, క్షిపణి పరీక్షల కారణంగా ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఈ బోటు ఇరుదేశాల మధ్య జల సరిహద్దును ఉల్లంఘించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తమ దేశానికి చెందిన సిబ్బందిని, బోటును విడిచిపెట్టాలని దక్షణ కొరియా అధికారికంగా ఉత్తర కొరియా మారిటైమ్ యంత్రాంగానికి లేఖ రాసింది. ఉత్తర కొరియా కూడా ఈ లేఖ తమకు అందిందని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఫోన్ ద్వారా దక్షిణ కొరియా అధికారులకు తెలియజేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments