Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాద మూలాలు పాక్‌లోనే: జర్దారీ

Webdunia
ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న ఉగ్రవాద మూలాలు పాకిస్థాన్ దేశంలోనుంచే పుట్టుకొచ్చాయని ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఎట్టకేలకు బుధవారం హుందాగా అంగీకరించారు.

స్వల్పకాలిక ప్రయోజనాలకోసమే పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆయన అన్నారు. తమ దేశంలో ఉగ్రవాదం పెచ్చుమీరడంతో పాలనాపరమైన వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాలిబన్ తదితర తీవ్రవాద శక్తులను మట్టుబెట్టేందుకు, వారితో పోరాడేందుకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా ముందుకు రావాలని, దేశ సౌభాగ్యంకోసం అందరు ఒకత్రాటిపై రావాలని ఆయన పిలుపునిచ్చారు.

గతంలో అమెరికాలో జరిగిన 9/11 సంఘటన ఆ దేశ ప్రజలనేకాక యావత్ ప్రపంచాన్నే గడగడలాడించిందని ఆయన తెలిపారు. ఈ సంఘటన అమెరికా ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉందని, వారు నిత్యం భయం గుప్పిట్లో ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఇదిలావుండగా పాకిస్థాన్‌లోని పెషావర్‌లోనున్న నాసిర్‌బాగ్‌‌‌ రోడ్‌లో ఓ మానవబాంబు పేలింది. బుధవారం నాడు జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం.

కాగా సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే దానిపై ఏ తీవ్రవాద సంస్థకూడా ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై తాము విచారణ చేపట్టామని అధికార వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments