Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాద దాడులపై విచారణ చేపట్టిన ఎఫ్‌బీఐ

Webdunia
పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌, రావల్పిండి సమీపంలోనూ ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులపై విదేశీ విచారణ సంస్థ ( ఎఫ్‌బీఐ ) బృందం విచారణ ప్రారంభించింది.

పాకిస్థాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌, రావల్పిండి సమీపంలోనూ ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులపై విదేశీ విచారణ సంస్థ ( ఎఫ్‌బీఐ ) బృందం విచారణ ప్రారంభించిందని పాకిస్థాన్ ఏఐజి ముహ్మద్‌ అస్లామ్‌ ఖాన్‌ తరీన్‌ పేర్కొన్నారు.

అక్కడ జరిగిన ఉగ్రవాద దాడుల్లో అమెరికా పౌరులు కొందరు మృత్యువాత పడగా, మరి కొందరు తీవ్రగాయాల పాలైనారు.

దీంతో ఎఫ్‌బీఐ బృందం రావల్పిండిలోని పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారంనాడు సందర్శించింది. అక్కడ దాడులకు సంబంధించి పోలీసులు సేకరించిన ఆధారాలను పరిశీలించింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఈ బృందం సద్దార్‌ బైరూనీ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి దాదాపు 90 నిమిషాల పాటు విచారణ చేసిందని ఆయన తెలిపారు.

ఎఫ్‌బీఐ విచారణాధికారులు పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్న సమయంలో లోపలికి ఎవరినీ అనుమతించ లేదు. అమెరికన్‌ ఎంబసీకి చెందిన పాకిస్తాన్‌ ఉద్యోగి ఈ బృందం వెంట ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments