Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాక్‌లో బాంబు పేలుడు: 28 మంది మృతి

Webdunia
దక్షిణ ఇరాక్‌లోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రదేశంలో బుధవారం సంభవించిన బాంబు పేలుడులో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది ఈ కారు బాంబు దాడిలో గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నసారియాకు పశ్చిమంగా 20 మైళ్ల దూరంలో ఉన్న అల్- బాథాలో జరిగిన కారు బాంబు దాడిలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని నసారియా ప్రాంతీయ మండలి అధికారి అక్రమ్ అల్ తమీమీ వెల్లడించారు.

అమెరికా దళాలు ఇరాక్‌లో యుద్ధం ప్రారంభించిన తరువాత దేశవ్యాప్తంగా వర్గపోరు, తిరుగుబాట్లు విస్తరించినప్పటికీ దక్షిణ ప్రాంతంపై మాత్రం ఈ ప్రభావం పడలేదు. ఈ ప్రాంతంలో షియా వర్గీయులు ఎక్కువగా నివసిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సున్నీ తీవ్రవాదులు, అల్‌ఖైదా ఇక్కడ కారు, ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నాయి.

వచ్చే జనవరిలో జరగబోతున్న పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా పెద్దఎత్తున హింసాకాండ జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా దళాలు ఇరాక్ నగరాలను ఈ నెలాఖరుకు ఖాళీ చేస్తుండటం ద్వారా దాడులు పెరుగుతాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జరిగిన కారు బాంబు దాడిలో మృతుల సంఖ్యపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. భద్రతా దళాలు మొత్తం 30 మంది ఈ దాడుల్లో మృతి చెందారని చెబుతున్నాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments