Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా భూకంపం: 1,100కి మృతుల సంఖ్య

Webdunia
భూకంపం ఇండోనేషియాను తీవ్రంగా కుదిపివేసింది. ఈ భూకంప తాకిడిలో మృతుల సంఖ్య 1,100కు చేరుకుంది. అలాగే సుమారు వేల మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారిలో కొంత మంది భవంతుల్లోను మరియు ఇతర చోట్ల సంక్లిష్ణ పరిస్థితుల్లో ఉండవచ్చని సమాచారం. భూకంపం సంభవించినప్పటి నుంచి ప్రజలను రక్షించేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.

కానీ, నిన్న రాత్రి మాత్రం శోధించే కార్యక్రమాలను నిలిపివేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు సుసిలో బమ్‌బాంగ్ యుధోయనో మాట్లాడుతూ, ఎంత నష్టం జరిగిందో అంచనాకు రాలేకపోతున్నామన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలకు మాత్రం సిద్ధమయ్యామన్నారు.

బుధవారం రిక్టర్ స్కేలుపై 7.6గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారుల సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సమాచారం ప్రకారం.. 777 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య.. 1,100కి చేరుకునే లేదా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. 440 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా తన చిన్న వయసులో ఇండోనేషియాలోనే గడిపారు. ప్రస్తుతం ఇండోనేషియాలో సంభవించిన సుమాత్రా భూకంపం నేపథ్యంలో.. సహాయాన్ని అందిస్తామని ఒబామా హా్మీ ఇచ్చారు. అలాగే సునామీ భీబత్సానికి గురైనా దక్షిణ పసిఫిక్ దేశాలు.. సమావో, అమెరికన్ సమావోలకు కూడా సాయం అందిస్తామన్నారు.

కాగా, ఇండోనేషియాలోని పడాంగ్‌లో అత్యధికంగా మృతుల సంఖ్య నమోదైంది. సుమారు. 500 భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Show comments