Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి: ముగ్గురి మృతి

Webdunia
ఆఫ్ఘనిస్థాన్‌లో సైనికులను లక్ష్యంగా చేసుకొని సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కాందహార్ ప్రావీన్స్‌లో ఈ దాడి జరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. దాడిలో మరో ఐదుగురు సైనికులు, ఇద్దరు పాదచారులు గాయపడ్డారు.

ఈ దాడికి తాలిబాన్ తీవ్రవాదులు బాధ్యత వహించారు. తాలిబాన్ ప్రతినిధి ఒకరు గుర్తు తెలియని ప్రదేశం నుంచి టెలిఫోన్‌లో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రపంచదేశాలు దళాల సంఖ్యను పెంచుతూ తాలిబాన్లతో పోరాడుతున్నప్పటికీ, హింసాకాండను నియంత్రించలేకపోతున్నాయి. తాలిబాన్ల చెర నుంచి కాబూల్‌ను 2001లో విదేశీ సేనలు విడిపించాయి.

అప్పటి నుంచి ఈ దేశంలో అమెరికా నేతృత్వంలో నాటో సేనలు తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో 32 వేల మంది అమెరికా సైనికులు, మరో 30 వేల మంది పశ్చిమదేశాల సేనలు ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఆఫ్ఘనిస్థాన్‌లో తమ సైనికుల సంఖ్యను 68 వేలకు చేర్చేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments