భారత్ నౌకాదళంలోకి కొత్తగా చేరనున్న రెండు అణు శోధిత జలాంతర్గాములు ఆందోళన కలిగించే అంశమని పాకిస్థాన్ అభిప్రాయపడింది. సంఖ్యాబలంతోనే కాకుండా, ఇతర సాంకేతిక అంశాలతో భారత నౌకాదళంతో తాము సరితూగలేమని, అలా సరితూగాలని కూడా తాము అనుకోవడంలేదని పాక్ నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ మహ్మద్ అసిఫ్ అభిప్రాయపడ్డారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ... భారత నౌకాదళంలో చోటుచేసుకున్న ఈ వ్యూహాత్మక కోణం తమకే కాక మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఆందోళన కలిగించే అంశంగా ఆయన అభివర్ణించారు. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని అణ్వస్త్రికరించడం ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు ఏమాత్రం దోహదం చేయదని తాము భావిస్తున్నట్టు చెప్పారు.
సమీప భవిష్యత్తులో భారత నౌకాదళంలోని రెండు అణు జలాంతర్గాములు వచ్చి చేరనున్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ అరిహంత్ ఒకటి కాగా, మరోటి రష్యా లీజ్కు ఇచ్చిన అకులా క్లాస్కు చెందిన ఐఎన్ఎస్ చక్ర మరొకటి.