అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై సెప్టెంబరు 11, 2001న జరిగిన దాడికి కుట్రపన్నినవారు తమ దేశంపై మళ్లీ దాడి చేసేందుకు వ్యూహరచన చేస్తూనే ఉన్నారని ఆ దేశ అధ్యక్ష భవన ప్రతినిధులు పేర్కొన్నారు. వైట్హోస్ ప్రతినిధులు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ అనుమానం వెలిబుచ్చారు.
9 /11 దాడికి వ్యూహరచన చేసి, దానిని అమలు చేసిన కుట్రదారులు అమెరికన్లపై దాడులకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారని చెప్పారు. వారు ఇప్పటికీ అమెరికాను లక్ష్యంగా చేసుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, మరో దాడికి కుట్ర జరుగుతోందని వైట్హోస్ మీడియా విభాగ సహాయ కార్యదర్శి బిల్ బుర్టోన్ విలేకరుల వద్ద పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా సేనలు తీవ్రవాదులపై యుద్ధం కొనసాగించేందుకు ఇదే కారణమని తెలిపారు. అమెరికాపై సెప్టెంబరు 2001లో దాడి చేసిన తీవ్రవాదులు ఇప్పటికీ ఆఫ్ఘనిస్థాన్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అమెరికన్లపై దాడులకు వారు ఇప్పటికీ కుట్ర పన్నుతూనే ఉన్నారు. ఈ కారణంగానే అమెరికా సేనలు ఆఫ్ఘనిస్థాన్లో కొనసాగుతున్నాయని చెప్పారు.