అంతర్జాతీయ తీవ్రవాది, అల్ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు సంబంధించిన సమాచారం బ్రిటన్, అమెరికా నిఘా వర్గాల వద్ద ఉంటే తమతో పంచుకోవాలని పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ విజ్ఞప్తి చేశారు. లాడెన్ ఎక్కడ ఉన్నాడో తెలిపితే తప్పకుండా తమ దేశం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
దీనిపై ఆయన మంగళవారం మాట్లాడుతూ.. లాడెన్ గురించి నిఘా వర్గాల వద్ద ఉన్న సమాచారాన్ని యూకే, యూఎస్లు తమతో పంచుకోలేదని చెప్పారు. లాడెన్కు సంబంధించిన సమాచారం ఎవరివద్దనైనా ఉన్నా తమతో పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు కోరారు.
ఇకపోతే.. దేశ రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ.. దేశాధ్యక్షుడు జర్దారీ, తనకు మధ్య ఎలాంటి అవాంతరాలు లేవన్నారు. తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు తాము కృషి చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.