దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో 1908 నుంచి 1910 వరకు భారత జాతిపిత మహాత్మాగాంధీ నివశించిన పూరిగుడిసె (ది క్రాల్)ను ఫ్రెంచ్ టూరిజం కంపెనీ దక్కించుకుంది.
ప్రపంచంలోనే టూరిజం రంగంలో అగ్రగామిగానున్న వోయగేవుర్స్ ద ముండే అనే ఫ్రెంచ్ కంపెనీ ఆ ఇంటి యజమానులు అడిగిన ధర కంటే రెట్టింపు ధర ఇచ్చి ఆ ఇంటిని కొనుగోలు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా చారిత్రక సంపదను కొనుగోలు చేస్తున్న ప్రక్రియలో భాగంగానే గాంధీ నివశించిన ఇంటిని కూడా కొనుగోలు చేసి గాంధీ మ్యూజియంకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. వందేళ్ళ చరిత్ర కలిగిన ఆ ఇంటిని తమ సంస్థ కొనుగోలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఆ ఇంటి యజమానులు నాన్సీ, జరోడ్ బాల్ 1981లో ఈ ఇంటిని 65వేలకు కొన్నారు. ప్రస్తుతం ఈ ఇంటిని 3,77,029 అమెరికన్ డాలర్లకు ఫ్రెంచ్ కంపెనీ కొనుగోలు చేసింది. జోహాన్నెస్బర్గ్లోని ఆర్కార్డ్స్లోనున్న ఆ ఇంటి నుంచే గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతాలను రూపొందించినట్లు చేసినట్లు ఆ యజమానులు తెలపడం గమనార్హం.