ఎండాకాలం.. మొక్కల సంగతి ఏంటి?

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (10:20 IST)
ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సమస్త జీవరాశులు వేడిమికి తాళలేకపోతున్నాయి. మొక్కల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో నీరు అందకపోతే వాడి నశించిపోతాయి. మిద్దెపై తోటలు పెంచేవారు మొక్కలు కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెరటిలో పెంచే మొక్కలకైతే ఎండ భూ ఉపరితలం మీద మాత్రమే పడుతుంది. 
 
కానీ మిద్దె కాంక్రీటుతో నిర్మించబడి ఉంటుంది. కుండీల్లో మొక్కలు నాటాల్సి వస్తుంది. అందువల్ల కుండీల చుట్టూ కూడా ఎండ పడుతుంది. కాబట్టి మొక్కలు వాడిపోతాయి. ఎంత తీవ్రత నుండి వాటిని రక్షించాలి. షేడ్ నెట్ కట్టాలంటే దానికి బలమైన సపోర్ట్ కావాలి. లేకపోతే పెద్ద గాలి వస్తే కొట్టుకుపోతుంది. దీని నిర్మించాలంటే శ్రమ, ఖర్చు ఉంటుంది. కాబట్టి నీటి సరఫరా విషయంలో శ్రద్ధ తీసుకుంటే మొక్కలను కాపాడుకోవచ్చు. మొక్కలకు ఉదయం, సాయంత్రం నీరు పెట్టాలి. మధ్యాహ్నం పెట్టకూడదు. 
 
సాయంత్రం మిద్దె పైకి వెళ్లి మొక్కలను పరిశీలించాలి. ఆకులు వాలినట్లు తేమ శాతం తగ్గినట్లు కనిపిస్తే చర్యలు తీసుకోవాలి. మొక్కలకు వేర్లు పైపైనే ఉంటాయి. వాటికి వేరు స్థాయికి మించి క్రిందకు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. తోటలో రాలిన ఆకులను మొక్కల మొదళ్లలో కప్పాలి. అప్పుడు పెట్టిన నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. ఆకులు కుళ్లి ఎరువుగా మారుతాయి. 
 
షేడ్ నెట్‌లు అవసరం లేకుండా ఉండాలంటే మిద్దె తోటలో పండ్ల చెట్లు పెంచాలి. ఇవి పెరిగి నీడ పడేలా చేస్తాయి. హైబ్రిడ్ చెట్లు నాటితే మరీ మంచిది. ఇవి ఎక్కువ ఎత్తు పెరగవు, పండ్లు త్వరగా కాస్తాయి. గాలికి పడిపోకుండా ఉంటాయి. తోటలోని మొక్కల నుండి మంచి దిగుబడి సాధించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

మహిళా ఐఏఎస్ అధికారులను కించపరిచిన వారిపై కఠిన చర్యలు : పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

తర్వాతి కథనం
Show comments