Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్ క్రీడాకారుల కోసం ప్రణాళిక : బింద్రా

Webdunia
బుధవారం, 24 సెప్టెంబరు 2008 (14:47 IST)
భారత్‌లోని వర్థమాన క్రీడాకారులకు చేయూతనిచ్చే దిశగా తాను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా తన ఆధ్వర్యంలో 500 పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించనున్నట్టు బింద్రా పేర్కొన్నారు.

ఈ విషయమై బింద్రా మాట్లాడుతూ నాణ్యమైన విద్య, క్రీడల్లో శిక్షణ ఇచ్చే విధంగా ఈ స్కూళ్లను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. అభినవ్ బింద్రా ఏస్ పబ్లిక్ స్కూల్స్ (ఏబీఏపీఎస్) పేరుతో స్థాపించనున్న ఈ పాఠశాలల విషయమై బింద్రా మీడియాకు వివరించారు. తాను స్థాపించనున్న ఈ పాఠశాలల బాగోగులను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని బింద్రా తెలిపాడు.

భవిష్యత్‌లో ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తన పాఠశాలలకు సంబంధించిన శాఖ ఉండేలా చూస్తానని బింద్రా పేర్కొన్నాడు. ఈ పాఠశాలలకు సంబంధించి చదువు ఇతర వసతులు అన్ని చోట్లా ఒకేలా ఉంటాయని కూడా బింద్రా తెలిపాడు. ఈ పాఠశాలల్లో విద్యతో పాటు షూటింగ్, ఆర్చరీ, ఈక్వెస్ట్రియన్, టెన్నిస్, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో విద్యార్ధుల ఉన్నత స్థాయి శిక్షణ అందించనున్నట్టు బింద్రా తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే కాదు.. స్టేషన్‌లలో కూడా రద్దీనే రద్దీ

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

Show comments