Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుచికరమైన బియ్యంపిండి పాయసం తయారీ

Webdunia
సేమియాతో పాయసం తయారు చేయడం అందరికీ తెలిసిందే. అయితే బియ్యం పిండితో పాయసాన్ని తయారు చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రుచికరమైన బియ్యంపిండి పాయసం తయారు చేయడం ఎలాగో తెలుసుకుందాం.

బియ్యంపిండి పాయసం తయారీకి కావాల్సినవి : బియ్యం- పావు కప్పు, చక్కెర- 100- 150 గ్రాములు, పాలు-రెండున్నర కప్పు, యాలకులు- రెండు, ఎండుద్రాక్ష- 30 గ్రాములు, కుంకుమపువ్వు- కొంచెం.

పాయసం తయారు చేయు విధానం : తడిబియ్యాన్ని ఆరబెట్టి తర్వాత సన్నటి నూకగా ఉండేలా దంచుకోవాలి. తర్వాత పాలు తీసుకుని పాత్రలో పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు బియ్యపు పొడిని, యాలకుల పొడిని వేసి బాగా మరగనివ్వాలి. అయితే పాయసం అడుగు మాడకుండా దాన్ని మధ్య, మధ్యలో కలియబెడుతుండాలి.

పాయసం బాగా చిక్కగా వచ్చాక పొయ్యి నుంచి దించేయాలి. కాసేపు తర్వాత కుంకుమపువ్వు చల్లి మళ్లీ పొయ్యిపై పెట్టాలి. ఇప్పుడు చక్కెర కూడా కలిపి కాసేపు సన్నని మంటపై ఉండనిచ్చి దించేయాలి. ఇలా తయారు చేసిన బియ్యం పాయసాన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే తినడం ప్రారంభిస్తే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

Show comments