ప్రస్తుతం మన దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు దఫాలుగా హెచ్చరికలు చేస్తోంది. వచ్చే 2050 నాటికి భారత్లో 60 కోట్ల మంది మధుమేహ రోగులు ఉంటారని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జీవనశైలిని మార్చుకుని ముందుకుసాగినట్టయితే ఫలితం ఉంటుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. అయితే, ఒకసారి ఈ వ్యాధిబారినపడితే చక్కెర రోగగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న అంశాన్ని తెలుసుకుందాం.
* ముందుగా అన్నం, గోధుమలు, మైదా, చక్కెర నిలిపి వేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
* ప్రతి రోజు రాగిజావలో మజ్జిగ పోసుకొని త్రాగుతుంటే మధుమేహం తగ్గుతుంది.
* మొలకెత్తిన మెంతుల పొడిని, ప్రతి రోజు రెండు పూటలు ఒక చెంచా చొప్పున సేవిస్తుంటే మధుమేహం తగ్గుతుంది.
* ప్రతీ రోజు ఉదయాన్నే గ్లాసు నీటిలో గుప్పెడు కొత్తిమీరకాడలతో సహా వేసి 3-4 నిమిషాలు ఉడకబెట్టి, వడగట్టి గోరువెచ్చగా త్రాగాలి.
* 1.5 గంటలు నడక, జాగింగ్ లేదా ఏదైనా శారీరక వ్యాయామం తప్పనిసరి.
మధుమేహ రోగులు తినకూడని ఆహార పదార్థాలు. (బంగాళాదుంపలు, కంద వంటి మూల కూరగాయలు, మామిడి పండ్లు, అరటి కాయ)