Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారింజ తొక్క పొడి, శొంఠితో చిన్నారులకు ఆ సమస్య రాదు..?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (10:01 IST)
కమలాపండు ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, మినరల్స్ కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతాయి. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..
 
1. గొంతునొప్పిగా ఉన్నప్పుడు నారింజ తొక్కలను పొడి చేసుకోవాలి. గ్లాస్ పాలల్లో కొద్దిగా నారింజ తొక్క పొడి, చక్కెర కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేయడం వలన గొంతునొప్పి తగ్గుతుంది.
 
2. శరీర వేడి అధికంగా ఉన్నవారు.. రోజూ కమలాపండు జ్యూస్ తీసుకుంటే వేడి తగ్గుతుంది. దాంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
3. తలనొప్పిగా ఉన్నప్పుడు కమలా తొక్క పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి నుదిటిపై రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. 
 
4. చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నవారు.. రోజూ ఉదయాన్నే నారింజ తొక్క పొడితో పళ్లు తోముకుంటే సమస్య పోతుంది. దాంతో పాటు దంతాలు తెల్లగా కూడా మారుతాయి. 
 
5. ఈ చలికాలంలో పిల్లలకు ఆయాసం, జలుబు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు.. నారింజ తొక్కను పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా శొంఠి, అల్లం, పటికబెల్లం వేసి బాగా మరిగించుకోవాలి. 20 నిమిషాల తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టి చల్లారిన తరువాత తీసుకుంటే ఆయాసం, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments