Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున 10 కరివేపాకులు తింటే...

కర్ణుడు లేని భారతం, కరివేపాకులేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. అలాగే, 'కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్త

Webdunia
సోమవారం, 31 జులై 2017 (09:51 IST)
కర్ణుడు లేని భారతం, కరివేపాకులేని కూర ఒకటేనని అంటారు మన పెద్దలు. అలాగే, 'కరివేపాకే కదా' అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. 
 
అందుకే ప్రతి కూరలోనూ కరివేపాకు వేస్తుంటాం. ఈ ఆకు వేయడం వల్ల కూరలకు మంచి రుచి, వాసన వస్తాయి. అయితే కూరల్లో లేదా ఇతర ఏ ఆహార పదార్థాల్లో ఉన్న కరివేపాకును అయినా చాలా మంది తినరు. పక్కన పెట్టేస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయే లాభాలు చదివితే కరివేపాకును వదిలి పెట్టకుండా తింటారు. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున 10 కరివేపాకు ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
రక్తహీనత సమస్య ఉన్నవారు నిత్యం పది కరివేపాకులను తింటే రక్తం బాగా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు వృద్ధి అవుతాయి. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది. 
 
నిత్యం ఉదయాన్నే కరివేపాకు ఆకులను తింటే మధుమేహం కొద్ది రోజుల్లో పూర్తిగా అదుపులోకి వస్తుంది. టైప్ 1, 2 ఎలాంటి డయాబెటిస్ అయినా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. 
 
మద్యంబాబు, మాంసాహారం అధికంగా ఆరగించేవారికి సహజంగానే కాలేయ సమస్యలు వస్తాయి. అయితే నిత్యం కరివేపాకు ఆకులను తింటుంటే లివర్ శుభ్రమవుతుంది. లివర్‌లో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. 
 
కరివేపాకులు తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. డయేరియా సమస్య తొలగిపోతుంది. నీళ్ల విరేచనాలు ఆగుతాయి. వెంట్రుకలు చక్కగా పెరుగుతాయి. నల్లగా మారుతాయి. చుండ్రు పోతుంది. నేత్ర సమస్యలు ఇది చక్కటి ఔషధం. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments